![]() |
![]() |

కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఐతే ఇప్పుడు అదే ఆర్పీ తన తోటి కమెడియన్ కి సాయం చేస్తానంటూ ముందుకొచ్చాడు. "అతనికి ఎంత ఖర్చైనా పర్లేదు ఆపరేషన్ ఖర్చులు భరిస్తాను. అతని ఇంటి అద్దెతో సహా అన్ని ఖర్చులను నేనే పెట్టుకుంటానని హామీ ఇచ్చాడు. దీనికి సంబంధించి ఫస్ట్ చెక్ ను వచ్చే నెలలో పంచ్ ప్రసాద్ కి ఇస్తానని" ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీన్ని నేను పేరు కోసం చేయడం లేదన్నాడు. ప్రసాద్ వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు అన్నాడు.
రీసెంట్ గా వాళ్ళ ఇంటికి చేపల పులుసు తీసుకుని వెళ్లి పలకరించి వచ్చినట్లు చెప్పాడు. బయటికి కనిపిస్తున్నంత హ్యాపీగా లేడు అని బాధపడ్డాడు. మణికొండలో త్వరలో తన చేపల పులుసు బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నట్లు చెప్పాడు. ప్రసాద్కి ఆస్తులేం లేవు.. అన్నీ అప్పులే ఉన్నాయి. కాబట్టి.. పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్కి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని చెప్పాడు. వచ్చే నెల నుంచి పంచ్ ప్రసాద్ పూర్తి బాధ్యతల్ని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తరపున తానూ, సత్తన్నా తీసుకుంటున్నాం అంటూ పెద్ద మనసును చాటుకున్నాడు. దేవుడి దయవల్ల బిజినెస్ బాగుంటే ఎవరికో సాయం చేసేకంటే.. ముందు మన అనుకున్న వాడికి సాయం చేస్తే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. "మణికొండలో నెక్స్ట్ మంత్ బ్రాంచ్ స్టార్ట్ చేసి అదే రోజు పంచ్ ప్రసాద్ కి ఫస్ట్ చెక్ ఇస్తాను.
ఆ తరువాత కిడ్నీ ఆపరేషన్ ఎంత ఖర్చు అవుతుందో అంతా మేమే భరిస్తాం. దేవుడి దయతో వాడు కోలుకుంటే అంతే చాలు అన్నాడు. ఇద్దరు పిల్లలతో ఇంటద్దె కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. పది లక్షలైనా.. 15 లక్షలైనా నూటికి నూరు శాతం ఇచ్చిన మాట తప్పను" అన్నాడు కిర్రాక్ ఆర్పీ. కూకట్పల్లిలో స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్రాంచి కొన్ని రోజులు మూసేసాడు ఆర్పీ. గ్రౌండ్ లెవెల్ లో అన్ని సమస్యల్ని పరిష్కరించుకుని మళ్ళీ వారంలోనే కర్రీ పాయింట్ ని స్టార్ట్ చేసాడు.
![]() |
![]() |